ETV Bharat / city

రాష్ట్రంలో ఇసుక తుపాను రాబోతుంది: యనమల - amaravathi issue

హైకోర్టు వ్యాఖ్యలతో ప్రభుత్వ అసమర్థత మరోసారి బయటపడిందని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని హితవు పలికారు.

యనమల
author img

By

Published : Oct 25, 2019, 12:53 PM IST

రాజధానిపై హైకోర్టు వ్యాఖ్యలు వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి చెంపదెబ్బ అని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. హైకోర్టు వద్ద లాయర్లకు కనీసం కప్పు టీ కూడా దొరకటం లేదని చేసిన వ్యాఖ్యలకు ఈ ప్రభుత్వం సిగ్గుపడాలని అన్నారు. వైకాపా ప్రభుత్వ అసమర్థతకు ఈ మాటలు అద్దం పట్టాయని యనమల విమర్శించారు. ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి అభివృద్ది పనులు వేగవంతంగా పూర్తి చేయాలని హితవు పలికారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఎం జగన్ మధ్య చర్చలు ఏమీ జరగలేదని భాజాపా నేతలే చెప్పడాన్ని యనమల ప్రస్తావించారు. 45 నిమిషాలు చర్చలు జరిగాయని వైకాపా నేతలు అబద్దాలు చెప్పారని ఆరోపించారు. చర్చలు ఏమీ లేకుండానే... జరిగినట్లుగా ఎలా చెబుతారని యనమల ప్రశ్నించారు. రాష్ట్రంలో త్వరలో ఇసుక తుపాన్ రాబోతుందని అన్నారు.

ఇదీ చదవండి

రాజధానిపై హైకోర్టు వ్యాఖ్యలు వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి చెంపదెబ్బ అని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. హైకోర్టు వద్ద లాయర్లకు కనీసం కప్పు టీ కూడా దొరకటం లేదని చేసిన వ్యాఖ్యలకు ఈ ప్రభుత్వం సిగ్గుపడాలని అన్నారు. వైకాపా ప్రభుత్వ అసమర్థతకు ఈ మాటలు అద్దం పట్టాయని యనమల విమర్శించారు. ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి అభివృద్ది పనులు వేగవంతంగా పూర్తి చేయాలని హితవు పలికారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఎం జగన్ మధ్య చర్చలు ఏమీ జరగలేదని భాజాపా నేతలే చెప్పడాన్ని యనమల ప్రస్తావించారు. 45 నిమిషాలు చర్చలు జరిగాయని వైకాపా నేతలు అబద్దాలు చెప్పారని ఆరోపించారు. చర్చలు ఏమీ లేకుండానే... జరిగినట్లుగా ఎలా చెబుతారని యనమల ప్రశ్నించారు. రాష్ట్రంలో త్వరలో ఇసుక తుపాన్ రాబోతుందని అన్నారు.

ఇదీ చదవండి

"రాష్ట్ర అంశాలపై అమిత్​ షాతో జగన్ చర్చించలేదు"

Intro:Body:

ap_vja_18_25_yanamala_on_highcourt_dry_3064466_2510digital_1571979640_897


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.