ETV Bharat / city

తేలని విద్యుత్తు వివాదం... ఇక సుప్రీం తీర్పే శరణ్యం - తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ ఉద్యోగుల విభజన

తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ సంస్థల ఉద్యోగుల పంపకాలపై వివాదం తేలలేదు. ఈ అంశంపై రెండ్రోజులుగా విచారణ జరిపిన జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ.. తుది ఆదేశాలేమీ ఇవ్వకుండానే ముగించింది. వారంలోగా తుది నివేదికను సుప్రీంకోర్టుకు.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇస్తామని కమిటీ స్పష్టం చేసింది.

justice-dharmadhikari-may-submit-his-report-to-supreme-electricity-employees-division-soon
ప్రతీకాత్మక చిత్రం
author img

By

Published : Dec 16, 2019, 6:27 AM IST

తేలని విద్యుత్తు వివాదం... ఇక సుప్రీం తీర్పే శరణ్యం

తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ విచారణ ముగిసింది. ఆదివారం రెండోరోజు హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఆయన విచారణ జరిపారు. ఏపీ దక్షిణ డిస్కం సీఎండీ, జీఎండీ, తెలంగాణ జెన్‌కో సంచాలకుడు సహా ఇతర అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ స్థానికత గల 1157 మందిని 2015లో తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి రిలీవ్ చేశారు. వీరిని చేర్చుకునేందుకు ఏపీ విద్యుత్‌ సంస్థలు నిరాకరించటంతో ఈ వివాదాన్ని తేల్చడానికి ధర్మాధికారితో ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. వీరిలో 613 మంది ఏపీలోనే చేరతామని ఆప్షన్‌ ఇచ్చినందన... వారిని అక్కడ చేర్చుకుంటే మిగిలిన వారిని తెలంగాణలో తిరిగి చేర్చుకోవడానికి ఇబ్బంది లేదని తెలంగాణ రాష్ట్ర సంస్థలు ఆదివారం రాతపూర్వకంగా తెలిపాయి. ఈ 1157 మంది కాకుండా ఏపీలో ప్రస్తుతం పని చేస్తున్న వారిలో 256 మంది తెలంగాణకు వెళతామని ఆప్షన్ ఇచ్చినందున వారిలో సగం మందిని కూడా తీసుకుంటామని పేర్కొన్నాయి. కానీ 613 మందిని ఏపీలోకి చేర్చుకుంటేనే మిగతా వారిని తీసుకుంటామని షరతు పెట్టాయి. ఈ ప్రతిపాదనలన్నింటిని ఏపీ తిరస్కరించింది. ఇక ఈ అంశంపై విచారణ ముగిసిందని... తుది నివేదికను సుప్రీంకోర్టుకు ఇస్తామని జస్టిస్ ధర్మాధికారి ప్రకటించారు. ఆయన ఇచ్చే తుది నివేదికలోని సిఫార్సులే సుప్రీంకోర్టు ఆదేశాలుగా త్వరలో వెలువడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

తేలని విద్యుత్తు వివాదం... ఇక సుప్రీం తీర్పే శరణ్యం

తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ విచారణ ముగిసింది. ఆదివారం రెండోరోజు హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఆయన విచారణ జరిపారు. ఏపీ దక్షిణ డిస్కం సీఎండీ, జీఎండీ, తెలంగాణ జెన్‌కో సంచాలకుడు సహా ఇతర అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ స్థానికత గల 1157 మందిని 2015లో తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి రిలీవ్ చేశారు. వీరిని చేర్చుకునేందుకు ఏపీ విద్యుత్‌ సంస్థలు నిరాకరించటంతో ఈ వివాదాన్ని తేల్చడానికి ధర్మాధికారితో ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. వీరిలో 613 మంది ఏపీలోనే చేరతామని ఆప్షన్‌ ఇచ్చినందన... వారిని అక్కడ చేర్చుకుంటే మిగిలిన వారిని తెలంగాణలో తిరిగి చేర్చుకోవడానికి ఇబ్బంది లేదని తెలంగాణ రాష్ట్ర సంస్థలు ఆదివారం రాతపూర్వకంగా తెలిపాయి. ఈ 1157 మంది కాకుండా ఏపీలో ప్రస్తుతం పని చేస్తున్న వారిలో 256 మంది తెలంగాణకు వెళతామని ఆప్షన్ ఇచ్చినందున వారిలో సగం మందిని కూడా తీసుకుంటామని పేర్కొన్నాయి. కానీ 613 మందిని ఏపీలోకి చేర్చుకుంటేనే మిగతా వారిని తీసుకుంటామని షరతు పెట్టాయి. ఈ ప్రతిపాదనలన్నింటిని ఏపీ తిరస్కరించింది. ఇక ఈ అంశంపై విచారణ ముగిసిందని... తుది నివేదికను సుప్రీంకోర్టుకు ఇస్తామని జస్టిస్ ధర్మాధికారి ప్రకటించారు. ఆయన ఇచ్చే తుది నివేదికలోని సిఫార్సులే సుప్రీంకోర్టు ఆదేశాలుగా త్వరలో వెలువడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి

అట్టుడుకుతున్న దిల్లీ... ఘర్షణల్లో 40మందికి గాయాలు

TG_HYD_42_15_ELECTRICITY_EMPLOYEES_DIVIDED_PKG_3182388 reporter : sripathi.srinivas Note : బైట్స్ డెస్క్ వాట్స్ అప్ కు పంపించాను. యాంకర్ : తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ విచారణ నేటితో ముగిసింది. 1157 మంది ఆంధ్ర స్థానికత కలిగిన ఉద్యోగులను తెలంగాణకు కేటాయించడం పై గత కొంత కాలంగా ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఈ వివాదం నడుస్తోంది. శని, ఆదివారాలు విచారణ జరిపిన జస్టిస్ ధర్మాధికారి తమ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేయనున్నారు. Look... వాయిస్ : ఏపీ, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల విభజన అంశం త్వరలో ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రం విడిపోయినా గడిచిన ఐదు సంవత్సరాల నుంచి విద్యుత్ ఉద్యోగుల విభజన జరుగకపోవడతో విద్యుత్ ఇంజినీర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సమస్య పరిష్కారం కోసం సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ధర్మాధికారితో ఒక కమీటీని సుప్రీంకోర్టు నియమించింది. నాటి నుంచి నేటి వరకు పలు దఫాలుగా విచారణ కొనసాగించిన కమిటీ... చివరి సమావేశాన్ని హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో నిర్వహించింది. ఏపీ స్థానికత కలిగి తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న 1157 మందిని 2015 జూన్‌లో తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి రిలీవ్‌ చేశారు. వారిని ఏపీ సంస్థలు చేర్చుకోకపోవడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై కమిటీ విచారణ జరుపుతూ వచ్చింది. ఈ 1157 మందిలో 613 మంది తాము ఏపీలోనే పనిచేస్తామని ఆప్షన్‌ ఇచ్చారు. వారిని చేర్చుకోవడానికి ఇబ్బంది ఏముందని జస్టిస్‌ ధర్మాధికారి ఏపీ అధికారులను గతంలోనే ప్రశ్నించారు. తమ ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం చెపుతామని వారు సమాధానమిచ్చారు. 613 మందిని ఏపీలో చేర్చుకుంటే మిగిలిన 545 మంది పంపకాలపై సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని ధర్మాధికారి వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈనేపథ్యంలో రెండు రోజుల పాటు జరిగిన విచారణలో కూడా గతంలో చెప్పిన తీర్పే మళ్ళీ ప్రస్తావించారని తెలంగాణ విద్యుత్ ఇంజినీర్స్ జెఎసి నేతలు పేర్కొన్నారు. బైట్ : శివాజీ, తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ జెఎసి కన్వీనర్. బైట్స్ : అంజయ్య, విద్యుత్ జెఎసి నేత. వాయిస్ : జస్టిస్ ధర్మాధికారి విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించిన విచారణ పూర్తికావడంతో ఆ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేయనున్నారు. అయితే 1157 మంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉద్యోగులలో 613 మందిని ఎపికి కేటాయించారని, వీరుకాకుండా మరో 256 మంది తాము తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తామని ఆప్షన్ ఇవ్వడంతో 256 మందిలో 50 శాతం మందిని తెలంగాణకు కేటాయింపు చేయనున్నట్లు తెలంగాణ విద్యుత్ ఇంజినిర్స్ చెబుతున్నారు. విభజన ప్రక్రియను తెలంగాణ విద్యుత్ యాజమాన్యం త్వరగా పూర్తిచేయాలని వీటివల్ల పదోన్నతులు కూడా ఆగిపోతున్నాయని టీఈఈఏ నేతలు వాపోతున్నారు. END....

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.