ETV Bharat / city

రాజధాని సమస్య 29 గ్రామాలకే కాదు... రాష్ట్రం మొత్తానిది: జేసీ

అమరావతి కోసం పోరాటం ఉద్ధృతం చేయాని మాజీ మంత్రి జేసీ దివాకర్​ రెడ్డి పిలుపునిచ్చారు. మందడం రైతులు చేస్తున్న నిరసన దీక్షకు జేసీ దివాకర్​రెడ్డి సంఘీభావం తెలిపారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని డిమాండ్​ చేశారు.

author img

By

Published : Jan 15, 2020, 12:56 PM IST

jc diwaker on amaravathi
అమరావతిపై జేసీ దివాకర్ వ్యాఖ్యలు
మందడంలో రైతుల దీక్షకు సంఘీభావం తెలిపిన జేసీ దివాకర్​రెడ్డి

జగన్‌ సీఎం కాగానే విశాఖ రాజధాని అనుకున్నారని జేసీ దివాకర్‌రెడ్డి ఆరోపించారు. ఒక వ్యక్తి, కులంపై ద్వేషంతో రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టకూడదన్నారు. మందడంలో రైతులు చేస్తున్న నిరసన దీక్షకు జేసీ దివాకర్​రెడ్డి సంఘీభావం తెలిపారు. రాజధాని 29 గ్రామాల సమస్య కాదని.. రాష్ట్ర ప్రజలందరిదీ అని అన్నారు. ఏడు నెలలుగా విజయసాయి రెడ్డి దిల్లీ, విశాఖకు తిరుగుతూనే ఉన్నారని విమర్శించారు.

గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తీసుకొచ్చిన పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని మండిపడ్డారు. సీఎం జగన్​ ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టుకున్నారని దివాకర్​ రెడ్డి అన్నారు. రాజధాని ఉంటే అమరావతిలో ఉండాలని... ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు చేస్తున్న శాంతి పోరాటం అన్ని సమయాల్లో సరికాదన్నారు. మహిళలపై దాడులు దారుణమని వాపోయారు. ఈ నెల 23న ఐకాస సమావేశమై కార్యాచరణ రూపొందిస్తుందని వెల్లడించారు.

ఇదీ చదవండి

రైతుల జీవితాల్లో అసలైన సంక్రాంతి వచ్చేదెన్నడు?

మందడంలో రైతుల దీక్షకు సంఘీభావం తెలిపిన జేసీ దివాకర్​రెడ్డి

జగన్‌ సీఎం కాగానే విశాఖ రాజధాని అనుకున్నారని జేసీ దివాకర్‌రెడ్డి ఆరోపించారు. ఒక వ్యక్తి, కులంపై ద్వేషంతో రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టకూడదన్నారు. మందడంలో రైతులు చేస్తున్న నిరసన దీక్షకు జేసీ దివాకర్​రెడ్డి సంఘీభావం తెలిపారు. రాజధాని 29 గ్రామాల సమస్య కాదని.. రాష్ట్ర ప్రజలందరిదీ అని అన్నారు. ఏడు నెలలుగా విజయసాయి రెడ్డి దిల్లీ, విశాఖకు తిరుగుతూనే ఉన్నారని విమర్శించారు.

గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తీసుకొచ్చిన పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని మండిపడ్డారు. సీఎం జగన్​ ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టుకున్నారని దివాకర్​ రెడ్డి అన్నారు. రాజధాని ఉంటే అమరావతిలో ఉండాలని... ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు చేస్తున్న శాంతి పోరాటం అన్ని సమయాల్లో సరికాదన్నారు. మహిళలపై దాడులు దారుణమని వాపోయారు. ఈ నెల 23న ఐకాస సమావేశమై కార్యాచరణ రూపొందిస్తుందని వెల్లడించారు.

ఇదీ చదవండి

రైతుల జీవితాల్లో అసలైన సంక్రాంతి వచ్చేదెన్నడు?

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.