ETV Bharat / city

జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ - ap high court

ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఎలా వేశారంటూ ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా పాలనాధికారిని హైకోర్టు ఆదేశించింది.

high-court-serious-on-jagan-government
జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ
author img

By

Published : Dec 13, 2019, 1:11 PM IST

Updated : Dec 13, 2019, 1:53 PM IST

జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ

హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఎలా వేశారంటూ ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి... వైకాపా రంగులు వేయడం గురించి పిటిషన్‌ దాఖలైంది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఎలా వేశారంటూ నిలదీసింది. 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా పాలనాధికారిని హైకోర్టు ఆదేశించింది.

జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ

హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఎలా వేశారంటూ ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి... వైకాపా రంగులు వేయడం గురించి పిటిషన్‌ దాఖలైంది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఎలా వేశారంటూ నిలదీసింది. 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా పాలనాధికారిని హైకోర్టు ఆదేశించింది.

Last Updated : Dec 13, 2019, 1:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.