ETV Bharat / city

'రాజధాని సమస్య ఒక ప్రాంతానిదే కాదు...ప్రజలందరిదీ'

ఈ నెల 30, 31 తేదీల్లో రాజధాని ప్రాంతంలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. హైదరాబాద్‌ జనసేన కార్యాలయంలో అమరావతి రైతులు పవన్​ను కలిసి తమ ఆవేదనను వెలిబుచ్చారు. రాజధాని సమస్య ఒక ప్రాంతానిది కాదని...రాష్ట్ర ప్రజలదని జనసేనాని రైతులకు తెలిపారు.

author img

By

Published : Aug 24, 2019, 4:51 PM IST

Updated : Aug 24, 2019, 5:09 PM IST

జనసేన అధ్యక్షులు  పవన్ కల్యాణ్
'రాజధాని సమస్య ఒక ప్రాంతానిదే కాదు...ప్రజలందరిదీ'

హైదరాబాద్‌ జనసేన కార్యాలయంలో అమరావతి రైతులు జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్​ను కలిశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి ప్రకటన చేయలేదని వాపోయారు. మంత్రి బొత్స వ్యాఖ్యలతో ఆందోళన చెందుతున్నామన్నారు. రాజధానిని వేరేచోటికి తరలిస్తారేమోనని భయపడుతున్నామని...అన్ని పార్టీలు, సామాజికవర్గాల మద్దతు కూడగడుతున్నట్లు రైతులు తెలిపారు. రాజధాని ప్రాంతంలోని పరిస్థితులను పవన్​కు రైతులు వివరించారు. కొండవీటి క్యాచ్​మెంట్ హిల్ ప్రాంతంలో గతంలో 16వేల క్యూసెక్కులకు మించి నీరు ఎప్పుడూ రాలేదన్నారు. 1903లో మాత్రమే 222 మి. మీ వర్షం పడిందని...ఆ తర్వాత 2005-06లో 166మి. మీ వర్షం మాత్రమే పడిందన్నారు.

రాజధాని ముంపు ప్రాంతం కాదు..
రాజధాని ముంపు ప్రాంతం కాదని...రాజధానిలోనూ నిర్మాణాలు కొనసాగుతున్నాయని...కొన్ని చాలా పురోగతిలో ఉన్నాయని రైతులు తెలిపారు. గ్రామస్థులంతా సమావేశాలు పెట్టుకుని 28వేల మంది రైతులు ...34వేల ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చామని అన్నారు.

రాజధాని సమస్య ఒక ప్రాంతానిది కాదని.. .రాష్ట్ర ప్రజలదని జనసేనాని రైతులకు తెలిపారు. ఈ నెల 30, 31 తేదీల్లో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని పవన్​కళ్యాణ్​ రైతులకు తెలిపారు. ఈ పర్యటనలో అమరావతిలో నిలిచిపోయిన పనులను జనసేనాని పరిశీలించనున్నారు.

ఇదీ చూడండి:''జనసేనానీ.. మా పోరాటానికి మద్దతుగా నిలవండి''

'రాజధాని సమస్య ఒక ప్రాంతానిదే కాదు...ప్రజలందరిదీ'

హైదరాబాద్‌ జనసేన కార్యాలయంలో అమరావతి రైతులు జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్​ను కలిశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి ప్రకటన చేయలేదని వాపోయారు. మంత్రి బొత్స వ్యాఖ్యలతో ఆందోళన చెందుతున్నామన్నారు. రాజధానిని వేరేచోటికి తరలిస్తారేమోనని భయపడుతున్నామని...అన్ని పార్టీలు, సామాజికవర్గాల మద్దతు కూడగడుతున్నట్లు రైతులు తెలిపారు. రాజధాని ప్రాంతంలోని పరిస్థితులను పవన్​కు రైతులు వివరించారు. కొండవీటి క్యాచ్​మెంట్ హిల్ ప్రాంతంలో గతంలో 16వేల క్యూసెక్కులకు మించి నీరు ఎప్పుడూ రాలేదన్నారు. 1903లో మాత్రమే 222 మి. మీ వర్షం పడిందని...ఆ తర్వాత 2005-06లో 166మి. మీ వర్షం మాత్రమే పడిందన్నారు.

రాజధాని ముంపు ప్రాంతం కాదు..
రాజధాని ముంపు ప్రాంతం కాదని...రాజధానిలోనూ నిర్మాణాలు కొనసాగుతున్నాయని...కొన్ని చాలా పురోగతిలో ఉన్నాయని రైతులు తెలిపారు. గ్రామస్థులంతా సమావేశాలు పెట్టుకుని 28వేల మంది రైతులు ...34వేల ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చామని అన్నారు.

రాజధాని సమస్య ఒక ప్రాంతానిది కాదని.. .రాష్ట్ర ప్రజలదని జనసేనాని రైతులకు తెలిపారు. ఈ నెల 30, 31 తేదీల్లో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని పవన్​కళ్యాణ్​ రైతులకు తెలిపారు. ఈ పర్యటనలో అమరావతిలో నిలిచిపోయిన పనులను జనసేనాని పరిశీలించనున్నారు.

ఇదీ చూడండి:''జనసేనానీ.. మా పోరాటానికి మద్దతుగా నిలవండి''

Intro:కార్పొరేటు దీటుగా మెరుగైన విద్యాబోధన


Body:ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే ప్రతి విద్యార్థికి కార్పొరేటు దీటుగా మెరుగైన విద్యాబోధన అందించాల్సిన చర్యలు తీసుకుంటున్నామని ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రాంతీయ సంచాలకులు బీమా వెంకటయ్య తెలిపారు. ఉదయగిరి లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. కళాశాల అధ్యాపకుల తో సమావేశమై y విద్యా బోధన తీరు, స్టడీ అవర్స్ నిర్వహణపై చర్చించారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు అధ్యాపకులు చక్కటి బోధనను అందించి భవిష్యత్తులో విద్యార్థుల ప్రయోజకులు అయ్యేలా చేయాలన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సహకరిస్తుంది అన్నారు. ఉదయగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ ఏడాది అడ్మిషన్లు బాగా తెల్లగా ఉన్నారు. గతేడాది ఇంటర్మీడియట్ ఫలితాలలో జిల్లా రెండో స్థానం సాధించింది అన్నారు. ప్రిన్సిపల్లు, అధ్యాపకుల సమిష్టి కృషి వల్ల సాధ్యమైందన్నారు. ఆర్ ఐ డి ఎఫ్ నిధులతో జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మంచి భవనాలను అందుబాటులోకి తెచ్చారన్నారు. మరో కోటి రూపాయల నిధులతో కళాశాలల్లో ఫర్నిచర్ వసతులు కల్పించడం జరిగిందని వివరించారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు మంచి బోధన అందించి కార్పొరేటు దీటుగా ఫలితాలు సాధించేలా చేస్తామన్నారు.


Conclusion:వాయిస్ :భీమా వెంకయ్య, ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రాంతీయ సంచాలకులు

రిపోర్టర్ : జి.శ్రీనివాసులు
సెల్ : 8008573944
Last Updated : Aug 24, 2019, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.