ETV Bharat / city

అమరావతి ప్రాంత ప్రజలు అధైర్యపడొద్దు: సుజనా చౌదరి

author img

By

Published : Dec 29, 2019, 3:18 PM IST

రాజధానిపై  ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా తుళ్లూరులో మహాధర్నా చేపట్టిన రైతులకు ఎంపీ సుజనా చౌదరి, రావెల కిశోర్ సహా ఇతర భాజపా నేతలు సంఘీభావం ప్రకటించారు.

bjp mp sujana chowdary on mandadm
సుజనా చౌదరి

రాజధానిపై ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా తుళ్లూరులో మహాధర్నా చేపట్టిన రైతులకు.. భాజపా నేతలు సంఘీభావం తెలిపారు. ఎంపీ సుజనా చౌదరి, రావెల కిశోర్ బాబు సహా... ఇతర భాజపా నేతలు నిరసనకారులతో మాట్లాడారు. ఉదయం అమరావతి అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పూర్తయిన తర్వాత... సుజనా చౌదరికి రాజధాని రైతులు వినతిపత్రం ఇచ్చారు. అక్కడి నుంచి నేరుగా తుళ్లూరు చేరుకొని రైతులకు సంఘీభావం తెలిపారు.

మందడం, వెలగపూడి వెళ్లి రైతులతో మాట్లాడారు. రాజధానిని అమరావతి నుంచి తరలించాలని చూస్తే కేంద్రం చూస్తూ ఊరుకోబోదని సుజనా హెచ్చరించారు. సీఆర్డీఏ, ఆర్​అండ్​ఆర్‌ చట్టాల ప్రకారం రాజధాని మార్పు అసాధ్యమని వివరించారు. అమరావతి ప్రాంత ప్రజలు అధైర్యపడొద్దని... భాజపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సీఆర్డీఏలో సంతకాలు పెట్టిన అమరావతి ప్రజలకు పరిహారం కోరే హక్కు ఉందని.. భాజపా ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. తుళ్లూరులో నిరసనలో ఉన్న రైతులకు సంఘీభావం తెలిపిన ఆయన... ప్రజాస్వామ్యంలో పొరపాట్ల వల్లే జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగి ఉంటే విచారణ జరపాలి తప్ప... రైతులను ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించారు.

రాజధానిపై ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా తుళ్లూరులో మహాధర్నా చేపట్టిన రైతులకు.. భాజపా నేతలు సంఘీభావం తెలిపారు. ఎంపీ సుజనా చౌదరి, రావెల కిశోర్ బాబు సహా... ఇతర భాజపా నేతలు నిరసనకారులతో మాట్లాడారు. ఉదయం అమరావతి అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పూర్తయిన తర్వాత... సుజనా చౌదరికి రాజధాని రైతులు వినతిపత్రం ఇచ్చారు. అక్కడి నుంచి నేరుగా తుళ్లూరు చేరుకొని రైతులకు సంఘీభావం తెలిపారు.

మందడం, వెలగపూడి వెళ్లి రైతులతో మాట్లాడారు. రాజధానిని అమరావతి నుంచి తరలించాలని చూస్తే కేంద్రం చూస్తూ ఊరుకోబోదని సుజనా హెచ్చరించారు. సీఆర్డీఏ, ఆర్​అండ్​ఆర్‌ చట్టాల ప్రకారం రాజధాని మార్పు అసాధ్యమని వివరించారు. అమరావతి ప్రాంత ప్రజలు అధైర్యపడొద్దని... భాజపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సీఆర్డీఏలో సంతకాలు పెట్టిన అమరావతి ప్రజలకు పరిహారం కోరే హక్కు ఉందని.. భాజపా ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. తుళ్లూరులో నిరసనలో ఉన్న రైతులకు సంఘీభావం తెలిపిన ఆయన... ప్రజాస్వామ్యంలో పొరపాట్ల వల్లే జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగి ఉంటే విచారణ జరపాలి తప్ప... రైతులను ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించారు.

సుజనా చౌదరి

ఇవీ చదవండి..

ఇలా చేస్తే రాష్ట్రం'సన్​రైజ్' కాదు.. 'సన్​సెట్' అవుతుంది!

Intro:ap_vzm_36_29_girijana_sangham_vinnapam_avbb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 ఎవరి రిజర్వేషన్లు వారికి ఉంచాలని ఓట్ల కోసం గిరిజనుల్లో చీలిక చేయవద్దని గిరిజన సంఘం నాయకులు కోరుతున్నారు


Body:విజయనగరం జిల్లా లో గిరిజనులు ఓట్ల కోసం ప్రజల్లో చీలిక తే వద్దంటూ అధికారులకు విన్నవించుకున్నారు పార్వతీపురం లోని సుందరయ్య భవనంలో లో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కె అవినాష్ కుమార్ అధ్యక్షతన గోడ పత్రిక విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అనర్హులకు ఎస్టీ దృవీకరణ పత్రాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు రాజకీయ నాయకులు ఓట్ల కోసం గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు బోయ వాల్మీక బెంతు ఒరియా లను ఎస్టిలో కలపవద్దని కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కు విజ్ఞప్తి చేయనున్నట్లు ఆయన చెప్పారు అధికారులను కలిసి గిరిజనులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు సంఘ జిల్లా అధ్యక్షులు అప్పారావు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు


Conclusion:గోడపత్రిక విడుదల చేసిన గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతున్న అవినాష్ కుమార్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.