సమరావతి: రాజధాని రైతుల జలదిగ్బంధం - three capitals for AP news
రాజధాని ప్రాంతం నిరసనలతో అట్టుడుకుతోంది. ఎనిమిదో రోజూ రాజధాని గ్రామాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తాళ్లాయపాలెం రేవులో రైతులు జలదీక్ష చేపట్టారు. నడుము లోతు నీళ్లులో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతినే ఉంచాలన్నారు. నవ్యాంధ్ర రాజధాని కోసం 30వేల ఎకరాలకు పైగా భూములు ఇచ్చామని గుర్తు చేశారు. తమ త్యాగాలను కొందరు పెయిడ్ ఆర్టిస్టులతో పోల్చుతున్నారని ఆగ్రహించారు. ఈ విధానం సరికాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్పష్టమైన ప్రకటన వచ్చే వరకూ పోరాటం ఆపేదని లేదని తేల్చి చెప్పారు.
amaravathi formers jaladiksha in krishna river
By
Published : Dec 25, 2019, 11:24 AM IST
రాజధాని కోసం భూములిచ్చాం..త్యాగాల్ని అవమానపరుస్తారా..?