ETV Bharat / city

ఆధార్ ఉంటే రూ.25... లేకుంటే రూ. వంద పెట్టాల్సిందే..! - subsidy to onions in ap

ఉల్లి గడ్డలకూ ఆధార్ అవసరమొచ్చింది. ఆధార్ కార్డ్ పట్టుకొని లైన్లో నిల్చున్నవారికి కిలో రూ.25 చొప్పున లభిస్తోంది. లేదంటే వంద రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిందే.

ఆధార్ ఉంటే రూ.25 లేకుంటే... రూ. వంద పెట్టాల్సిందే...!
author img

By

Published : Nov 24, 2019, 5:31 AM IST

రెండు నెలలుగా ఉల్లి ధరలు అంతకంతకూ పెరుగుతూ బహిరంగ మార్కెట్​లో కిలో వంద రూపాయలకు చేరువయ్యాయి. రైతు బజార్లలో చిన్నవే రూ.40 నుంచి రూ. 50 చొప్పున విక్రయిస్తున్నారు. నాణ్యమైన ఉల్లి ధర ఎక్కువ కావడం వల్ల వినియోగదారులు నాసిరకం సరుకునే కొనుక్కుంటున్నారు.

గంటల్లోనే ఖతం...

ఉల్లి ధరలు నియంత్రించేందుకు ప్రభుత్వం కిలో రూ.25 చొప్పున రైతు బజార్లలో పంపిణీ చేస్తోంది. వారం నుంచి విక్రయాలు మొదలయ్యాయి. వారంలో రెండు, మూడు రోజులపాటే విక్రయాలు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాకు 2 రోజులకొకసారి సరకును పంపిస్తున్నారు. అవి కూడా గంటల్లోనే అయిపోతున్నాయి.

వినియోగదారుల బారులు

ప్రకాశం జిల్లా ఒంగోలులో రాయితీపై అందించే ఉల్లి కొనుగోలుకు శనివారం వినియోగదారులు పెద్ద ఎత్తున బారులు తీరారు. రెండు, మూడు రోజుల కిందటి వరకూ రాష్ట్రంలోనే పలు ప్రధాన పట్టణాల్లో కిలో రూ. 80 నుంచి రూ.90 ఉంది. ఇప్పుడు అక్కడా రూ. వంద చొప్పున అమ్ముతున్నారు. ఖరీఫ్​లో మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు రాష్ట్రంలోనూ ఉల్లి విస్తీర్ణం, దిగుబడులు తగ్గాయి. భారీ వర్షాలకు నష్టం పెరిగింది. శుక్రవారం కర్నూలు మార్కెట్​లో రైతులు గరిష్ఠంగా క్వింటాలుకు రూ.7వేలకు పైగా లభించింది.

ఇవీ చూడండి:

పురపోరు నిర్వహణకు కసరత్తు ముమ్మరం..!

రెండు నెలలుగా ఉల్లి ధరలు అంతకంతకూ పెరుగుతూ బహిరంగ మార్కెట్​లో కిలో వంద రూపాయలకు చేరువయ్యాయి. రైతు బజార్లలో చిన్నవే రూ.40 నుంచి రూ. 50 చొప్పున విక్రయిస్తున్నారు. నాణ్యమైన ఉల్లి ధర ఎక్కువ కావడం వల్ల వినియోగదారులు నాసిరకం సరుకునే కొనుక్కుంటున్నారు.

గంటల్లోనే ఖతం...

ఉల్లి ధరలు నియంత్రించేందుకు ప్రభుత్వం కిలో రూ.25 చొప్పున రైతు బజార్లలో పంపిణీ చేస్తోంది. వారం నుంచి విక్రయాలు మొదలయ్యాయి. వారంలో రెండు, మూడు రోజులపాటే విక్రయాలు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాకు 2 రోజులకొకసారి సరకును పంపిస్తున్నారు. అవి కూడా గంటల్లోనే అయిపోతున్నాయి.

వినియోగదారుల బారులు

ప్రకాశం జిల్లా ఒంగోలులో రాయితీపై అందించే ఉల్లి కొనుగోలుకు శనివారం వినియోగదారులు పెద్ద ఎత్తున బారులు తీరారు. రెండు, మూడు రోజుల కిందటి వరకూ రాష్ట్రంలోనే పలు ప్రధాన పట్టణాల్లో కిలో రూ. 80 నుంచి రూ.90 ఉంది. ఇప్పుడు అక్కడా రూ. వంద చొప్పున అమ్ముతున్నారు. ఖరీఫ్​లో మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు రాష్ట్రంలోనూ ఉల్లి విస్తీర్ణం, దిగుబడులు తగ్గాయి. భారీ వర్షాలకు నష్టం పెరిగింది. శుక్రవారం కర్నూలు మార్కెట్​లో రైతులు గరిష్ఠంగా క్వింటాలుకు రూ.7వేలకు పైగా లభించింది.

ఇవీ చూడండి:

పురపోరు నిర్వహణకు కసరత్తు ముమ్మరం..!

Intro:Body:

paper


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.