రెపో రేటుపై రిజర్వు బ్యాంకు నేడు కీలక ప్రకటన చేయనుంది. మూడు రోజుల పాటు జరిగే.. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం నేటితో ముగియనుంది. ఆర్థిక మాంద్యం పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఈ సారీ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక వృద్ధి పుంజుకునే వరకు వడ్డీ రేట్లు తగ్గిస్తూనే ఉంటామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గతంలో చెప్పడం ఇందుకు ఊతమిస్తోంది.
వడ్డీ రేటు తగ్గింపునకు కారణమయ్యే అంశాలు..
2019-2020 రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోడవం వంటి కారణాలను పరిగణించి ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
వీటికి తోడు అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా పెరగటం వంటి అంశాలను ఆర్బీఐ పరిశీలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.