ఎవరిదైనా జన్మదినమైతే నిండు నూరేళ్లు వర్ధిల్లూ.. అని దీవిస్తారు. ఒకవేళ ఆ ఆశీర్వచనాలు ఫలించి వందేళ్ల జీవితం జీవిస్తేనే ప్రస్తుత కాలంలో అంతా ఆశ్చర్యపోతున్నారు. కానీ శతాధిక జంటకు పుట్టినరోజు పండుగ జరిపించింది ఆ కుటుంబం.
కర్ణాటకలోని మండ్య జిల్లా మద్దూరు ప్రాంతం కొట్టనహళ్లికి చెందిన మంచెగౌడ వయసు 113 ఏళ్లు. ఆయన సతీమణి నిగమ్మకు 99 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా దంపతులిద్దరి జన్మదిన వేడుక జరిపించారు కుటుంబ సభ్యులు. 150 మంది పుత్ర, పౌత్రులు హ్యాపి బర్త్డే అని పాటలు పాడుతుండగా కేక్ కట్ చేసింది ఈ జంట.
1938లో పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంటకు ఏడుగురు సంతానం. ఆరుగురు కుమార్తెలు.. ఓ కుమారుడు. 20 ఏళ్ల కిందట మంచెగౌడ చూపు కోల్పోయారు.
ఇదీ చూడండి:హాంగ్కాంగ్లో ప్రజా విజయం... 'చైనా బిల్లు' ఉపసంహరణ