ఝార్ఖండ్లోని లాతేహార్లో జరిగిన నక్సల్స్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ హోంగార్డు మృతిచెందాడు. దీనితో ఈ ఘటనలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
లుకైతండ్ గ్రామంలో పోలీసు బృందం గస్తీ కాస్తుండగా.. శుక్రవారం రాత్రి 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో వాహనంపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. మృతుల్లో ముగ్గురు హోంగార్డులు, ఓ ఎస్సై ఉన్నారు.



మావోయిస్టుల దాడిని ఝార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఖండించారు. మృతి చెందిన వారి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమరులైన వారి కుటుంబసభ్యులకు దేశం అండగా ఉంటుందని ట్వీట్ చేశారు.
ఎన్నికల వేళ...
ఝార్ఖండ్లో ఈ నెల 30 నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో నక్సలైట్లు దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. దాడి నేపథ్యంలో ఎన్నికల పర్యవేక్షణ కోసం మాజీ ఐపీఎస్ అధికారి ఎమ్.కే దాస్ను ప్రత్యేక పోలీసు పరిశీలకుడిగా నియమించింది ఎన్నికల సంఘం(ఈసీ).
ఇదీ చూడండి:- తప్పిపోయాడనుకుంటే నెదర్లాండ్స్లో ప్రత్యక్షమయ్యాడు..!